SRPT: రైతుబంధు నిధులను వెంటనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం ధర్మభిక్షం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎరువులు అందించాలన్నారు. సన్నవడ్లకు హామీ ఇచ్చిన రూ. 500 బోనస్ ఇవ్వాలని అన్నారు.