T20 WC వేళ ఓ పాక్ క్రికెటర్ శ్రీలంకలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. లంకతో సూపర్-8 పోరుకు ముందు ఆ ప్లేయర్.. హౌస్ కీపింగ్ మహిళను వేధించాడు. గమనించిన తోటి సిబ్బంది ఆమెను రక్షించి.. హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై యాజమాన్యం పాక్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు చెప్పగా.. ఆయన క్షమాపణలు కోరి, సదరు ఆటగాడికి భారీగా ఫైన్ విధించాడు.