KMR: పిట్లంలోని రాంపూర్ గ్రామశివారులోని అలుగు వాగు వద్ద గల మర్రిచెట్టు కింద పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో SI ఆంజనేయులు సిబ్బందితో కలిసి నిన్న సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పట్టుబడగా, మరో 5గురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ. 4,500 నగదు, 3 సెల్ ఫోన్లు, 3 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారితో కలిపి మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు.
వార్తలు
పేకాట స్థావరంపై దాడి.. 8 మందిపై కేసు
Advertisement
Advertisement
Advertisement


