WGL: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే మురళి నాయక్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.