BDK: మణుగూరు మండలంలోని గుట్టమల్లారంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు స్పందించి, క్షతగాత్రులను మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.