KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులోని కాకతీయ కాలువ వద్ద భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ మోటార్లు ఏర్పాటు చేసుకొని సాగు చేసుకుంటున్న సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతులపై దొంగలు కన్నేశారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 16 విద్యుత్ మోటార్లను అపహరించుకుపోయారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు మోటార్లు కనిపించకుండా పోయాయి అని వాపోయారు.