NLG: నకిరేకల్ మండలం తాటికల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి కళ్ళజోడు అందజేస్తామని డాక్టర్ శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ HM ప్రజ్ఞాపురం వెంకన్న, క్యాంపు కోఆర్డినేటర్ లతీఫ్, వైద్య సిబ్బంది సరిత, ఉపాధ్యాయులు పండుగ తిరుమలయ్య, మార్త రాములు పాల్గొన్నారు.