KDP: చెన్నూరు మండల వ్యాప్తంగా గుర్రంపాడు, ఓబులంపల్లె గ్రామాల్లో మామిడి పంటను సాగుచేసిన రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీతో మామిడి పంటకు కవర్లు ఇవ్వనున్నట్లు ఉద్యానశాఖ అధికారి రామకృష్ణ గురువారం తెలిపారు. ఎకరాకు 6,000 ఫ్రూట్ కవర్లు అవసరమవుతాయన్నారు. హెక్టారుకు 15 వేల కవర్లు రాయితీతో అందించాలన్నారు. పంటపూత పిందే దశలో ఉంటే కవర్లు వినియోగించాలని సూచించారు.