KMM: కామేపల్లి మండలం కొత్తలింగాల విద్యుత్ సబ్ స్టేషన్లో ఏఈ ఎన్.శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ‘లైన్ మెన్ దివాస్’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే వో అండ్ ఎం సిబ్బందిని ఏఈ శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. విద్యుత్ వినియోగదారులకు వారు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు.