KMM: జిల్లాలో రూ. 4 వేల అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరోలు గ్రామానికి చెందిన ఉదయ్, విక్రమ్కి కొంత నగదు బాకీ ఉన్నాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి గొడవ జరగగా.. విక్రమ్ తన స్నేహితులు మహేష్, లింగరాజుతో కలిసి ఉదయ్పై కత్తితో దాడి చేశాడు. నిందితులు ముగ్గురిని ఎస్సై జగదీష్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.