ADB: జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య డ్రైవ్ పెండింగ్ ఫైళ్ల పరిష్కార కార్యక్రమం చేపట్టాలని రాజర్షి షా ఆదేశించారు.