KMM: కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో మొక్కజొన్న, వరి పంటలను DAO పుల్లయ్య బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ.. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించిందని, ఈ పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేయాలని సూచించారు. అనంతరం కూసుమంచిలో వాలంటీర్ల ద్వారా జరుగుతున్న డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేను పరిశీలించారు.