NRML: మద్యానికి బానిసైన లింగన్న(48)అనే వ్యక్తి ముధోల్ మండల కేంద్రంలో మృతి చెందాడు. బుధవారం మద్యం తాగి భార్యతో డబ్బుల విషయంలో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయిన లింగన్న, గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లె గుర్తించారు. ఫైర్ సిబ్బంది సహాయంతో బయటకు తీసే సమయానికి అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.