KKD: పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా శ్రీధర్ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్డీవో శ్రీరమణిని వేట్లపాలెం ఘటనకు సంబంధించి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. కలెక్టర్ ఎస్.ఎస్ మోహన్ ఆదేశాల మేరకు పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు. ఆర్డీవో కార్యాలయ సిబ్బంది శ్రీధర్కు స్వాగతం పలికారు.