సత్యసాయి: ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యం సేవించడంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బుధవారం పుట్టపర్తి రూరల్ పరిధిలోని బుగ్గపల్లి అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ నిర్వహించారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలను రికార్డు చేశారు.