KMR: బంజారాహిల్స్లోని తన కుటుంబ సభ్యులు, మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డిలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి కలిసి హోళీ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగ మన అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలన్నారు. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.