కర్నూలు జిల్లా వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షరాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరిలో అక్షరాభ్యాస శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఇవాళ సందర్శించారు. శిబిరంలో అభ్యాసకుల హాజరు, పాఠ్య బోధన విధానం, నేర్చుకునే పురోగతిని పరిశీలించిన కలెక్టర్, వయోజనులకు అక్షరాస్యత పెంపొందించే దిశగా కార్యక్రమాన్ని సమర్థవంతగా అమలు చేయాలన్నారు.