SKLM: రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎమ్డీ.ఫరూక్ను ఆయన కార్యాలయంలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. కొత్తూరు మండల కేంద్రాల్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నిర్మించాలని, నియోజకవర్గంలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆయనకు విజ్ఞప్తి చేశారు.