AP: మండలి ఛైర్మన్పై రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. ఐదుగురు సభ్యులు రాజీనామా చేసినా ఇంతవరకు మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. దీంతో ఛైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని 8 మంది ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లు సమాచారం. అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగా ఎమ్మెల్సీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.