MNCL: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా ప్రకటనలో తెలిపారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు- భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 9963104959 నెం.లో సంప్రదించాలన్నారు.