MLG: తాడ్వాయి మండలం కాల్వపల్లి ఆదివాసీలపై అటవీశాఖ దౌర్జన్యాలు తక్షణమే ఆపాలని BRS జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు. తరతరాలుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలపై అటవీ అధికారులు సాగిస్తున్న అరాచకాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఈ దాడులు నిలిపివేయాలని, లేదంటే బాధితుల పక్షాన BRS పెద్దఎత్తున పోరాటం చేస్తుందన్నారు.