ATP: అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ శిశువు మృతి చెందిందంటూ కొట్టాల కాలనీకి చెందిన దామోదర్, లక్ష్మీదేవి దంపతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఐదు రోజులుగా అంతా బాగుందని చెప్పి, సోమవారం అర్ధరాత్రి ఆపరేషన్ చేసి బిడ్డ చనిపోయిందని చెప్పడంపై వారు మండిపడ్డారు. తన భార్య గర్భసంచి కూడా తీసివేశారని దామోదర్ వాపోయారు.