JN: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో మంగళవారం పోలీసులు గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోని, ఆలేటి ఈశ్వర్, బొమ్మగాళ్ల శ్రీరామ్, చేరిపల్లి ప్రసాద్, మునిగేల రాజేష్, జాటోత్ రాజేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.