SDPT: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్య ప్రాణుల రక్షణ, పర్యావరణ సమతౌల్యంపై అధికారులు అవగాహన కల్పించి, హర్బల్ గార్డెన్లో ఔషధ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో FRO దివ్య, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధిరామ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.