ATP: పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలోని సుంకులమ్మ దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మంగళవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే నూతన దేవాలయ నిర్మాణానికి రూ.50,000 విరాళంగా అందజేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.