GDWL: ఆదిశిలాక్షేత్రం మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7:30 గంటలకు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పిస్తామని ఛైర్మన్ పట్వారి ప్రహలాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.