KDP: ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మైదుకూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, వెంకట సుబ్బయ్య కాలనీ, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వాహన పత్రాలు లేని 21 బైకులు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.