VZM: స్దానిక మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాలలో సోమవారం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ సుదర్శనరావు మాట్లాడుతూ.. 1879లో స్థాపించిన ఈ చారిత్రక సంస్థ దేశంలోనే రెండో పురాతన కళాశాల అని కొనియాడారు. అనంతరం కళాశాల టాపర్గా నిలిచిన అఖిలకు బంగారు పతకం, 45 మంది విద్యార్థులకు రూ. 2 లక్షల స్కాలర్షిప్లను అందజేశారు.