ASR: జీకేవీధి(మం) సీలేరు ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు, గంజాయి రవాణా నియంత్రణతో పాటు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్న నేపథ్యంలో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశామని ఎస్సై తెలిపారు. ప్రతి వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ విడిచి పెట్టారు.