HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కు మడికొండ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మడికొండలోని డంపింగ్ యార్డులో నిరంతరం చెత్త కాల్చడంతో వెలువడే దట్టమైన పొగ గ్రామమంతా కలుషితమై గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నట్లు బాధితులు తెలిపారు. యార్డును తక్షణమే తరలించాలని కలెక్టర్ను కోరారు.