AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారి ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ స్పందించారు. చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో వ్యక్తికి 75 శాతం కాలిన గాయాలయ్యాయని వివరించారు.