GDWL: పట్టణంలోని లైబ్రరీలో మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రధానంగా టాయిలెట్లు లేక మహిళా పాఠకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరారు.