ఉద్యోగ భవిష్య నిధి (EPF)పై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) 8.25 శాతంగా కొనసాగించాలని EPFO నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన 239వ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతే వడ్డీరేటు అందించగా.. ఈసారి కూడా ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.