NGKL: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 43 ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.