TPT: దొరవారిసత్రం మండలం మీజూరు సచివాలయం పరిధిలోని మల్లెపాలెం గ్రామంలో 94 మంది రైతులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల భూమి హక్కులను శాశ్వతంగా రక్షించేందుకు క్యూఆర్ కోడ్, బ్లాక్చైన్ టెక్నాలజీతో కూడిన ఆధునిక పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.