WNP: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 3 వ తేదీన శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి, తిరిగి రాత్రి 8 గంటలకు తెరుస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యావచనం, స్నాపన తిరుమంజనం, హోమాలు నిర్వహించనున్నారు. భక్తులు ఈ సమయాలను గమనించి సహకరించాలని కోరారు.