VZM: భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని కోరారు. సోమవారం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కార్మికుల, ఉద్యోగులతో కలిసి తమ నిరసన వ్యక్తం చేసి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉంగరాల శ్రీను, కనకరాజు పాల్గొన్నారు.