ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇళ్లను సోమవారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం సరైన పద్ధతి కాదన్నారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.