TG: రాష్ట్ర పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ఇండో-అమెరికన్ ట్రేడ్ డీల్ దేశానికి ప్రమాదకరమని, మోదీ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే ముప్పు ఉందని ఆరోపించారు. ఇరాన్ వంటి పరిస్థితులు మనకు రావొద్దని, మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం అందరూ యుద్ధానికి సిద్ధం కావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.