AP: గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? అని ప్రశ్నించారు. ‘అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారు. రామాయణ కాలం నుంచి ఆంధ్రా అనే పేరు ఉంది. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదు. మా ప్రాంతం.. మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు. ఎక్కడో ఉండి గరికపాటి ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వొద్దు’ అని మండిపడ్డారు.