VSP: పద్మనాభం మండలంలో కొండపై వెలసి ఉన్న అనంత పద్మనాభ స్వామి తెప్పోత్సవం ఆదివారం ఆలయ వేద పండితులు భక్తులు నడుము ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లను ఊరేగింపుగా కోనేరు వరకు తీసుకువెళ్లి పూలతో అలంకరించిన హంశ వాహనంపై కోనేరులోతెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో రాజు, ఎమ్మెల్యే గంట కుమారుడు రవితేజ, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.