VZM: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని ఆలయాలను మంగళవారం మూసివేస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేస్తామని చెప్పారు. ఉదయం 9.30 నుంచి రోజంతా భక్తులకు దర్శనాలకు అవకాశం ఉండదన్నారు. చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత సంప్రోక్షణ చేస్తామని, బుధవారం యథావిధిగా ఆలయాలు తెరుస్తామని తెలిపారు.