GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.