NLG: మిర్యాలగూడ మండలం, గూడూరులో ఆదివారం ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఒరిస్సాకు చెందిన మనీషా తారు, తవీర్ మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవనోపాధి కోసం గూడూరులోని ఇటుక బట్టీలో పనికి చేరిన ఈ దంపతుల మధ్య గొడవ జరగడంతో, తవీర్ భార్యను చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.