ATP: రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం రైతులు చేపట్టిన దీక్షకు ఆదివారం ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అసెంబ్లీలో గళం విప్పి 12 చెరువులకు నీరు తెప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అనంతరం రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.