SKLM: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ఈ మేరకు శనివారం జారీ చేసిన జీవో ద్వారా హామీ అమల్లోకి వచ్చింది. ఆదివారం జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి భాస్కరరావు దివ్యాంగులు తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.