RR: మసీదు బండలోని కుడికుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. సాహె స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్ కల్పన రమేష్ ఆధ్వర్యంలో, ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ ఆర్థిక సహకారంతో ఈ పునరుద్ధరణ పనులు చేపట్టారు. MLA గాంధీ సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్తో కలిసి ఈ రోజు చెరువును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు నాయకులు పాల్గొన్నారు.