BDK: అశ్వాపురం మండలం మల్లెలమడుగులో నిమ్స్ హాస్పిటల్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ మోహన్ రావు, మల్లెల మడుగుమడుగు సర్పంచ్ మచ్చా నరసింహారావు ప్రారంభించారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారితోపాటు మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి ఉన్నారు.