KDP: ఎర్రగుంట్ల- కడప రోడ్డులోని జువారి రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.