WG: భీమవరంలో శనివారం APTF ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మార్చి 3న ఏలూరులో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని గౌరవ అధ్యక్షురాలు బి. పుణ్యవతి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.శ్రీవల్లి, కె.జాన్ మోజెస్ పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.